కూడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కమిషనర్

0
340

కర్నూలు : 

కర్నూలు సిటీ : 

కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

➡️ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

 

కర్నూలు నగరంలోని కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహన రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యంగా అవసరమైన ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటు చేసి వాటిని ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన శివాజీ మహారాజ్ ఛత్రపతి (వై.జంక్షన్) కూడలిని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కూడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడలిని రూ.54 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 

 

  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు రమణ మూర్తి, డిసిపి వెంకటరమణ, డిఈఈ గిరిరాజ్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, టిఏఈ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిలబడటానికి నీడ లేదు - కూర్చోవడానికి కుర్చీ లేదు.
*బాపట్ల జిల్లా,బాపట్ల:* బాపట్ల నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది....
By Vadlamudi NagaVenkat 2026-04-06 11:37:48 0 203
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర సింగ్
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-08 11:18:20 0 133
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు,...
By Kothuru Murali 2026-03-24 13:34:44 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com