అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన

0
294

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి. రైల్వే గేట్ నెం.249, హనుమాన్ ఆలయం సమీపం, మడికట్ల బస్తీ, తుర్కపల్లి, బుడగ జంగం బస్తీ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. బియ్యం, గృహోపకరణాలు, టీవీలు సహా ఇంటి వస్తువులు నీటిలో మునిగిపోయాయి. ఒక కుటుంబానికి డోలి రమేష్ ఆర్థిక సాయం అందజేశారు.  ఈ సమస్యలపై మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో ప్రజలు అధికారులను అప్రమత్తం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి,హైడ్రా బృందం వెంటనే ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించింది.  ఈ తనిఖీలో జిహెచ్ఎంసి అధికారులు ఎస్.ఈ. చెన్నారెడ్డి డి.ఈ. రఘు, ఏ.ఈ. రవళి, హైడ్రా ఇన్‌ఛార్జ్ మనికంఠ పాల్గొన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించినందుకు జిహెచ్ఎంసి అధికారులు,హైడ్రా టీంకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ వార్డ్ కమ్యూనిటీ మెంబర్ శోభన్ బాబు , మహమ్మద్ జావిద్, జిహెచ్ఎంసి అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రాజ్ దేశాయ్
  శ్రీ గురురాజ్ దేశాయ్  మరియు బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీ ఉరుకుందు గారు వినతి...
By Boya Dasthagiri 2026-03-31 11:32:36 0 209
Telangana
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండల రెబ్బెనపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్...
By Avunoori Mahesh 2026-04-14 10:35:46 0 223
Andhra Pradesh
వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు    - నిమిషాల్లో పని పూర్తి...
By Rajini Kumari 2025-12-17 09:12:58 0 220
Goa
Goa Strengthens Coastal Surveillance During Monsoon
Goa authorities have intensified coastal surveillance following dangerous sea conditions caused...
By Navya Sree 2026-06-25 08:18:34 0 54
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు జనసేన, టీడీపీ నాయకుల భాగస్వామ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి...
By Kothuru Murali 2026-03-28 05:59:42 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com