చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
Posted 2026-02-07 13:56:26
0
180
చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.చీరాల ఎమ్మెల్యే కొండయ్య, నియోజకవర్గం అధికార ప్రతినిధి మహేంద్రనాధ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలిపారు. యువ నాయకుడు కీర్తి వెంకట్రావు చేరికతో టిడిపి పట్టణంలో మరింత బలం పుంజుకుందని వారు చెప్పారు.పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వ పాలనతో పాటు ఎమ్మెల్యే కొండయ్య పనితీరు నచ్చి టిడిపిలో చేరుతున్నట్లు కీర్తి వెంకట్రావు తెలిపారు.వార్డు అభివృద్ధిని,ప్రజల సంక్షేమాన్ని ఎప్పటికీ మర్చిపోనని వెంకట్రావు వెల్లడించారు.కాగా ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. యువత కేరింతలు కొట్టారు.చివరగా పోలేరమ్మ ఆలయం వద్ద భారీ బహిరంగ సభ జరిగింది.దీంతో టీడీపీకి కొత్త జోష్ వచ్చింది.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bastar’s Long-Awaited Dawn — Tricolour to Fly High After Decades of Silence
This Independence Day will mark a historic and deeply emotional moment for 14 remote tribal...
మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు*
...
కాలువ పూడికతీతలో అవినీతి: విచారణకు సామాజిక కార్యకర్తల డిమాండ్
పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులలో అవినీతి జరుగుతోందని సామాజిక కార్యకర్తలు...
పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడు
ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు
ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన...
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సిపీ నాయకుల డిమాండ్.
మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ...