మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష

0
326

 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  తన క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.  ఎమ్మెల్యే  మల్కాజ్గిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి పైపులైన్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌకూర్ గృహకల్పలో మౌలిక వసతుల కల్పన, త్రాగునీటి ఆలోకేషన్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.  కౌకూర్ జనప్రియ ఆర్కేడ్ విషయానికి సంబంధించి, అవసరమైన అండర్టేకింగ్ లెటర్ ( అఫిడవిట్‌)ను తీసుకుని, జలమండలి ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.  అలాగే, మచ్చ బొల్లారం ప్రాంతంలోని ఏడు కాలనీలకు ట్రంక్ మెయిన్ ఏర్పాటు పనులను 50:50 నిష్పత్తిలో పూర్తి చేయాలని సూచించారు. పంచశీల కాలనీలో త్రాగునీటి సరఫరా పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు.  ఇంకా, బోర్ వెల్స్‌కు సంబంధించిన మీటర్ల అనుసంధానం కోసం జిహెచ్ఎంసి మరియు జలమండలి అధికారుల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మల్కాజ్గిరి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను మంజూరు చేసేందుకు తాను ముమ్మరంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు.  ఈ సమీక్ష సమావేశంలో జలమండలి మేనేజర్ సునీల్, డీజీఎం లు సాంబయ్య, రాజు, మేనేజర్లు మల్లికార్జున్, సృజయ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

  SIDHUMAROJU 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:43:56 0 92
Andhra Pradesh
అనంతపురం: భర్త ఆచూకీ తెలపాలని ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా
విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం...
By Eslavath RameshNaik 2026-01-21 14:16:32 0 290
Andhra Pradesh
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
మదనపల్లె పట్టణంలోని ఎన్‌. వి. ఆర్‌ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో...
By Pagadala Venkateswar 2026-03-16 02:13:40 0 92
Telangana
భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్
వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి,...
By Kodam Prasad 2026-03-17 08:34:28 1 842
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:20:31 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com