రైల్వే స్టేషన్ వచ్చామా..!! చెత్త డంపింగ్ యార్డ్ వచ్చామా..!?

0
383

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొలారంబజార్. 

 

బొలారం బజార్ రైల్వే స్టేషన్: చెత్తతో పోరాడుతున్న ప్రయాణికులు.

బొలారం బజార్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది.

సికింద్రాబాద్.. నగరానికి సమీపంలో ఉన్న 'బొలారం బజార్ రైల్వే స్టేషన్' మల్కాజ్గిరి జిల్లాలో  చిన్నదే అయినా, కానీ ముఖ్యమైన స్టేషన్‌. ఈ స్టేషన్‌ ద్వారా పలు ఉపనగర ప్రాంతాల ప్రజలు రైలు సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే, ఇక్కడ పలు సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ప్రధాన సమస్యలు.

 1. పరిసరాల పరిశుభ్రత లోపం స్టేషన్ చుట్టూ చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాప్తి చెందుతోంది.వాడేసిన వస్తువులు, చెత్త, పాడైన సామగ్రి రోడ్డు పక్కన వదిలేయడం వలన ప్రజలు నడవడానికే ఇబ్బంది పడుతున్నారు.

2. రోడ్ల దుస్థితిస్టేషన్‌కి వెళ్లే రోడ్లు సన్నగా ఉండి, ఇరువైపులా చెత్త, పాడైన వస్తువులు, పక్కనే ఉన్న ఒక స్క్రాప్ షాప్. అతను రైల్వే స్టేషన్ చుట్టుపక్కల  స్క్రాప్ షాప్ సామాన్లన్నీ అక్కడే ఉంచి దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నాడు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.  స్క్రాప్ పేరుకోవడం వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీధిలోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే చర్యలు కనిపించడం లేదు.

3. ప్రజల అసౌకర్యాలు స్టేషన్ ప్రాంగణం శుభ్రంగా లేకపోవడం వల్ల ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణానికి వచ్చే కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు ఇక్కడ శుభ్రమైన వాతావరణం లేక ఇబ్బంది పడుతున్నారు.

ప్రజల డిమాండ్లు..

రైల్వే అధికారులు, స్థానిక మున్సిపల్ అధికారులు కలసి శాశ్వత పరిశుభ్రత చర్యలు తీసుకోవాలి. స్టేషన్ చుట్టూ చెత్త తొలగింపు, రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేయాలి. డస్ట్‌బిన్‌లు, శానిటేషన్ వర్కర్స్ ను నియమించి పరిశుభ్రతను కాపాడాలి. బొలారం బజార్ స్టేషన్‌ ఒక ముఖ్యమైన రైల్వే సౌకర్యం. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు ఇక్కడ రైలు ఎక్కి దిగి వెళ్తున్నారు. కానీ ఇలాంటి పరిసరాలు ఉంటే రైల్వే ప్రతిష్ట దెబ్బతినటమే కాకుండా ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ స్టేషన్‌ను శుభ్రంగా, సౌకర్యవంతంగా మార్చడం అవసరం.

    SIDHUMAROJU 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-28 12:31:26 0 371
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
By Pagadala Venkateswar 2026-04-21 03:14:46 0 156
Andhra Pradesh
కిడ్నీ డే సందర్భంగా టీ షర్ట్లు ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-03-09 17:34:30 0 170
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గంజాయి రహిత జిల్లా గా మారాలి ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్, ఐపీస్ గారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 27.12.2025* _*//గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు....
By KOTESWARARAO KVSR 2025-12-27 10:13:22 0 250
Mizoram
Mizoram Launches NID Pulse Polio Immunisation Drive
The government of Mizoram has officially launched its National Immunisation Day (NID) Pulse Polio...
By Lokeshwari Panthadi 2026-07-02 06:31:43 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com