అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు : దర్శించుకున్న ఎమ్మెల్యే

0
180

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సూర్యనగర్ కాలనీ ఫేజ్ 2లోని దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి పూజలు అర్పించి, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నవరాత్రులు మహిళ శక్తి ప్రాధాన్యతను గుర్తుచేసే పవిత్ర సందర్భమని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో భక్తి, సాంఘిక సేవలకు దోహదపడతాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డోలి రమేష్, సురేందర్ రెడ్డి,  స్థానిక కాలనీవాసులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా...
By Hari Krishna 2025-12-21 09:14:39 0 164
Andhra Pradesh
లాల్ పురంలో అలరించిన మహిళల కోలాటం.
గుంటూరు రూరల్ మండలం లాల్పురం ఈరన్నపాలెం శ్రీ రమణ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన...
By John Baji 2025-12-31 01:22:48 0 63
Andhra Pradesh
మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు)...
By Pagadala Venkateswar 2026-02-14 06:47:57 0 35
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com