కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘కార్యకర్తలతో ముఖాముఖి’ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

0
170

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి” నిర్వహించారు. వివిధ డివిజన్ల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని శ్రద్ధగా విని తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలే పార్టీకి బలం, పార్టీ అభివృద్ధికి మూలస్తంభాలని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి సమస్యలు పరిష్కరించడమే తన ప్రధాన బాధ్యత అని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు చేసేందుకు కార్యకర్తల సూచనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ.
ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-31 05:53:21 0 147
Business & Finance
Odisha Signs MoUs to Strengthen Agriculture and Farm Economy
The Odisha Department of Agriculture and Farmers' Empowerment has signed Memorandums of...
By Navya Sree 2026-07-04 06:20:29 0 26
Andhra Pradesh
Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!
Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన...
By Pagadala Venkateswar 2026-07-22 11:26:05 0 26
SURAKSHA
Jamjam Syamala Rao, IAS: Driving Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 05:39:58 0 83
Rajasthan
Rajasthan Extends MSP Wheat Procurement Till June 19
The Rajasthan government has officially extended the Minimum Support Price (MSP) wheat...
By Tejaswini Komanduru 2026-06-15 09:31:07 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com