బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి

0
227

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు.బోయిన్ పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బిఅర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేసిఆర్ కు కొడుకు, కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు.బిఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండడం సహజమని తెలిపారు.కాలేశ్వరం విషయంలో సిబిఐ కాదు ఎవరు ఏమి చేయలేరని, కెసిఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేశ్వరం లాంటి బహుళార్థసాధక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కేసిఆర్ కే దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    - sidhumaroju 

Search
Categories
Read More
Maharashtra
साहित्य संमेलनात अनुवादकाला अध्यक्षपद देण्याची मागणी
अनुवादक मंच या संस्थेने राज्यात वाढत्या #अनुवाद साहित्याच्या लोकप्रियतेचा दाखला देत एक महत्त्वाची...
By Pooja Patil 2025-09-13 05:31:44 0 79
Karnataka
Bengaluru Sees Sharp Rise in Human Rights Complaints
Banagalore- Karnataka - In the last two years, Bengaluru Urban has recorded a staggering 3,537...
By Citizen Rights Council 2025-08-11 10:43:05 0 1K
Andhra Pradesh
నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు
కర్నూలు నగరంలోని రాంబోట్ల దేవాలయం దగ్గర జిల్లా నాయకులతో కలిసి వినాయక నిమగ్ననోత్సవం కార్యక్రమంలో...
By mahaboob basha 2025-09-04 14:10:59 0 240
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com