కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్

0
436

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ, లక్ష్మీనగర్‌ వాసులు తమ కాలనీల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు మచ్చబొల్లారం డివిజన్‌ కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాయల్‌ ఎన్‌క్లేవ్‌లోని రోడ్‌ నెం.3, 8తో పాటు అవసరమైన చోట్ల సీసీ రోడ్లకు మంజూరు కల్పించాలని కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు కోరారు. అదే విధంగా లక్ష్మీనగర్‌ వాసులు తమ ప్రాంతంలో గుర్తించిన రహదారులపై అత్యవసరంగా సీసీ రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ మాట్లాడుతూ రెండు కాలనీల వాసుల అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించానని, త్వరితగతిన అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్
దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీవోను తీసుకోస్తున్నారు దీనిని వైఎస్ఆర్...
By mahaboob basha 2025-05-30 15:24:50 0 2K
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే రామాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ...
By Benguluri Madhubabu 2026-01-31 04:48:40 0 132
Andhra Pradesh
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ :
కర్నూలు : 13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్...
By Hari Krishna 2025-12-14 06:42:01 0 207
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com