ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్

0
489

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.   ఫేస్‌బుక్‌లో “షుగర్ సెన్సెస్ ప్రో హై ప్రొసీజర్ మానిటరింగ్ డివైస్ – హాట్ డీల్, బై వన్ గెట్ వన్ ఫ్రీ” అనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టారు. ఆ ప్రకటనలో 80,000 మంది సంతృప్తి చెందిన కస్టమర్లు ఉన్నారని చెప్పడంతో నమ్మి ఆర్డర్ చేసిన సీనియర్ సిటిజన్, వచ్చిన కొరియర్ తెరవగానే షాక్‌కు గురయ్యారు. డివైస్ బదులుగా రెండు సబ్బు బిళ్లలు, పేపర్ ప్లేట్స్ కాయలు మాత్రమే పంపించారు.   ఈ ఘటనతో బాధితుడు తీవ్రంగా ఆందోళన చెందగా, ఇతరులు ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ ప్రకటనలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు...
By Kothuru Murali 2026-04-02 06:46:37 0 65
Rajasthan
Massive TB Screening Campaign Flags 2.3 Lakh Suspected Cases
As part of a statewide campaign launched on June 25, Rajasthan health teams have screened 44% of...
By Bharat Aawaz 2025-07-17 07:20:42 0 1K
Andhra Pradesh
దొంగురువలసలో ఘనంగా జరిగిన రామమందిరం ప్రారంభోత్సవం
బొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ...
By Boiena Rajesh 2026-03-27 13:46:34 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com