వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి

0
175

విజయవాడ

26-12-2025

 

ప్రచురణార్ధం

 

*వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాళి*

 

*పలుచోట్ల జరిగిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు*

 

*నేటికీ కూడా ప్రజల గుండెల్లో పాతుకుపోయిన వ్యక్తి వంగవీటి మోహన రంగా - వెలంపల్లి శ్రీనివాసరావు*

 

పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులు పలుచోట్ల ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమాలలో మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా గారి విగ్రహానికి మరియు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 

 

స్థానిక 44వ డివిజన్ చెరువు సెంటర్ లోని వంగవీటి మోహన రంగ విగ్రహం వద్ద వైసిపి నాయకులు గొంది ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు

 

స్థానిక 47వ డివిజన్ కుండల మార్కెట్ వద్ద వైసిపి నాయకులు కూరాకుల నాగ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహన రంగ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణి చేసారు

 

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. రంగా గారు మరణించి నేటికి 37 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని గెలుచుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగ అన్నారు. ప్రజల సమస్యల కోసం చేస్తున్న పోరాటంలో రంగ గారు హత్యకు గురయ్యారన్నారు.హత్యకు గురై 37 సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం వంగవీటి మోహన రంగ గారిదన్నారు.

 

ఈ కార్యక్రమాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Technology
NTT DATA to Acquire WinWire for Enterprise AI Scalability
Global IT giant NTT DATA has announced its intent to acquire cloud-native specialist WinWire to...
By Dunna Jessicaruth 2026-05-18 12:15:42 0 36
Tamilnadu
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 declared, girls outperform boys
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 have been New Delhi: The Tamil Nadu...
By BMA ADMIN 2025-05-19 19:08:16 0 2K
Telangana
తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం.
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో...
By Ponnala Srinivasrao 2026-05-09 04:43:54 0 96
Andhra Pradesh
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు రానున్న జగన్ మోహన్ రెడ్డి.
గుంటూరు :ఈ రోజు 03.02.2026 మంగళవారం ఉదయం, మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్...
By John Baji 2026-02-03 11:47:32 0 119
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏకే భాష గారు
ది.15-12-2025 న అమరి జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ది బెజవాడ బార్ అసోసియేషన్ లో...
By Rajini Kumari 2025-12-16 07:55:58 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com