గూడూరు లో ఏపీయూడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ

0
580

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి*జెండావిష్కరణలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఆదివారం గూడూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ఏపీయూడబ్ల్యూజే నాయకులు జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సమావేశంలో పేర్కొన్నారు. జర్నలిస్టులందరకు అక్రిడేషన్లు, ఇంటి స్థలాలతోపాటు కొత్త ఇల్లును కూడా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ బీమా, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించి జర్నలిస్టులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఐక్యతతో పోరాటాలు సాగించి హక్కులను సాధించుకోవాలని సమావేశంలో పలువురు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కు సన్మానం చేసి ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లను జర్నలిస్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే స్టేట్ మెంబర్ జీ ఉరుకుందు, గౌరవ సలహాదారులు శ్రీనివాస నాయుడు, తాలూకా సెక్రెటరీ సాక్షి శ్రీనివాసులు, కార్యదర్శులు కిరణ్ కుమార్, దౌలత్ ఖాన్, ప్రభాకరు, లక్ష్మన్న, శరత్, అబ్దుల్లా, అబ్దుల్ లతీఫ్, మహబూబ్ బాషా, షేక్షావలి, ఇస్మాయిల్, మిన్నెల, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-11-05 09:19:25 0 579
Andhra Pradesh
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ...
By Boiena Rajesh 2026-03-13 04:50:53 0 154
Andhra Pradesh
వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా FIR డౌన్లోడ్: కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా :  హాయ్ అంటేFIR కాపీవాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో...
By Hari Krishna 2026-01-17 11:43:49 0 196
Goa
गोआत 15 सप्टेंबरपासून पुन्हा जलक्रीडा सुरू, पर्यटनाक चालना
मोसमी रिपॉज (#MonsoonBreak) संपल्यानंतर गोआतल्या समुद्रकिनाऱ्यांवर #जलक्रीडा क्रिया 15...
By Pooja Patil 2025-09-11 10:53:35 0 186
Andhra Pradesh
డీఐజీ ప్రకటన గంటల్లోనే నిందితుడు శవమై తేలిన ఘటన.
మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం కనసానివారిపల్లి...
By Pagadala Venkateswar 2026-02-18 06:48:35 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com