అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

0
693

హైదరాబాద్/ హైదరాబాద్.

 

ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా, సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క  సంతాపం వ్యక్తం చేశారు. తదనంతరం మంత్రి సీతక్క  మాట్లాడుతూ... శిబూ సోరెన్  ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడిగా.., ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారన్నారు. ముఖ్యంగా ఆయన గిరిజన సంఘాల హక్కుల కోసం, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ప్రసిద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల కోసం ఆయ‌న సాగించిన పోరాటం భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన ఆయన జీవితమే ఒక సందేశమని కొనియాడారు. దేశానికి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి గురూజీ మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. శిబు సోరెన్ చూపిన మార్గం ఈనాటి తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

-సిద్దుమారోజు 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు మార్కాపురం జిల్లా, మార్కాపురం పట్టణంలో...
By Chennaiah Kati 2026-01-27 16:01:11 0 77
Andhra Pradesh
కానివిని ఎరుగునని రీతిలో యర్రగొండపాలెం పట్టణం లో మహిళల వారి భారీ కోలాట ప్రదర్శన
కనివిని ఎరుగని రీతిలో యర్రగొండపాళెం పట్టణం లో మహిళల భారీ కోలాట ప్రదర్శన యర్రగొండపాలెం పట్టణంలోని...
By Chennaiah Kati 2026-01-14 06:09:29 0 151
Andhra Pradesh
కడపలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర
ఈరోజు కడప నగరంలో అయోధ్య రామ మందిరం మూడవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా కడపలో హిందూ బంధువులు...
By Benguluri Madhubabu 2026-01-22 04:32:02 0 171
Andhra Pradesh
సంక్రాంతి కి అదనం గా 41 ప్రత్యేక రైళ్ళు
కర్నూలు : సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు...
By Hari Krishna 2025-12-14 06:58:24 0 212
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com