అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

0
732

హైదరాబాద్/ హైదరాబాద్.

 

ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా, సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క  సంతాపం వ్యక్తం చేశారు. తదనంతరం మంత్రి సీతక్క  మాట్లాడుతూ... శిబూ సోరెన్  ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడిగా.., ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారన్నారు. ముఖ్యంగా ఆయన గిరిజన సంఘాల హక్కుల కోసం, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ప్రసిద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల కోసం ఆయ‌న సాగించిన పోరాటం భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన ఆయన జీవితమే ఒక సందేశమని కొనియాడారు. దేశానికి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి గురూజీ మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. శిబు సోరెన్ చూపిన మార్గం ఈనాటి తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

-సిద్దుమారోజు 

Like
1
Search
Categories
Read More
Telangana
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 11:33:16 0 78
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Telangana
కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్...
By Sidhu Maroju 2026-04-02 19:38:36 0 98
Telangana
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళి : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని...
By Sidhu Maroju 2025-11-26 06:46:55 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com