ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

0
891

సికింద్రాబాద్/అడ్డగుట్ట

 

సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఫిష్ వెంకట్ శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు అడ్డగుట్ట లోని వారి నివాసానికి వెళ్లి వెంకట్ పార్ధీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెంకట్ మంచి నటుడు అని, అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో ని అందరికి నాలుకలా ఉండేవాడని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-02-02 13:45:59 0 43
Andhra Pradesh
సంక్రాంతి పండుగ వేళ... పందేల జోలికి పోవద్దు :: కర్నూలు ఇంచార్జీ ఎస్సీ & డీఐజీ
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...సంక్రాంతి పండగల వేళ....పందెంల...
By Hari Krishna 2026-01-11 07:32:31 0 119
Telangana
కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ,...
By Sidhu Maroju 2025-08-24 15:49:55 0 440
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com