భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.

0
1K

17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్‌ లో ఒక వ్యక్తికి గంజాయిని ఇవ్వడానికి బీహార్‌కు చెందిన ఏ. రమేష్‌ కుమార్‌, ఏ చందన్‌ కుమార్‌ ఇద్దరు కలిసి మూడు బాగుల్లో 17 గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్‌ రైళ్లో వచ్చి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో గంజాయి ప్యాకెట్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ డీటీఎప్‌ సీఐ సావిత్రి సౌజన్యతో పాటు సిబ్బంది కలిసి, నిందితులను...గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి తీసుక వచ్చిన ఈ గంజాయిని డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని సికింద్రాబాద్‌ ఏఈఎస్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ గంజాయిని ఎవరికి  ఇవ్వడానికి తీసుక వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను.. గంజాయిని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో సీఐతోపాటు సత్యనారాయణ, ఖలీల్‌, రవి,శిల్పా, పరమేష్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం తో పాటు హైదరాబాద్‌ ఇంచార్జీ డీసీ. అనిల్‌కుమార్‌రెడ్డిలు అభినందించారు.

Search
Categories
Read More
Telangana
కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు
కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని...
By Thalakayala Nagashiva 2026-04-03 11:15:49 0 374
Telangana
AVN lake field global school inauguration
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్‌ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో...
By G k Nookala 2026-04-03 15:41:35 0 173
Jammu & Kashmir
Kashmir Academic Shift: Tech Workshops and Economic Models
Higher education in Jammu and Kashmir is undergoing a major transformation with a strong focus on...
By Lokeshwari Panthadi 2026-06-30 05:23:08 0 52
Andhra Pradesh
కత్తిపూడిలో డ్రైవర్లు నిర్లక్ష్యం.. రెండు లారీలు ఢీకొనడంతో సంబవించిన ప్రమాదం.. మంటల్లో క్లీనర్ మృతి..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద గురువారం...
By BABJI DADALA 2026-01-29 02:18:49 0 491
Telangana
మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా
బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా...
By Prashanth Goindla 2026-02-04 06:09:46 0 449
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com