దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు

0
300

తుమ్మలపల్లి 

 *25-12-2025*

 

 *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు* 

 

గతంలో రోడ్డు వెడల్పు కోసం తొలగించిన బస్ షెల్టర్కు తిరిగి *నూతన షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డాక్టర్ గారి కుమారుడు కృష్ణమోహన్* .

 

ఈరోజు తుమ్మలపల్లి గ్రామంతో పాటు సుమారు చుట్టూ గ్రామాలు అయిన కొమరగిరిపట్నం, ఓడలరేవు, తుమ్మలపల్లి గ్రామంలో పేదలు అయిన వృద్దులు, వితంతవులు అయినవారికి ఈరోజు తుమ్మలపల్లి గ్రామంలో పుట్టిన డాక్టర్ పరమట నరసింహామూర్తి గారు మరియు వారి రెండవ కుమారుడు కృష్ణమోహన్ గారు ఈరోజు అందరికీ రగ్గులు (చలి కాలంలో కప్పుకునే దుప్పట్లు ) నేరుగా వారి ఇళ్లకు వెళ్లి నేరుగా వారికి ఇవ్వటం జరిగింది ఈ సందర్బంగా వారి కుమారుడు కృష్ణ మోహన్అం మాట్లాడుతూ నాన్నగారు నరసింహామూర్తి గారి బాటలోనే నేను కూడా సేవా కార్యక్రమం లో పాల్గొవటం సంతోషం గా ఉందని అన్నారు. తుమ్మలపల్లి గ్రామానికి ఇప్పటివరకూ అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించమని భవిష్యత్తు లో కూడా గ్రామానికి కావలసిన అనేక అవసరాలకు తగ్గట్టు గా అందుబాటులో కి తేవడమే లక్ష్యం అని తెలిపారు త్వరలో నాన్నగారి పేరిట ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు దాని పేరు *Dr. PNM చారిటబుల్ ట్రస్టు* అని ఇక భవిష్యత్తే కార్యక్రమాలు ఆపేరుతో కోనసాగుతాయని కృష్ణమోహన్ తెలిపారు. అంతే కాకుండా గతంలో తుమ్మలపల్లి గ్రామంలో బస్ షెల్టర్ వారి తల్లితండ్రులు పేరిట నిర్మించిన బస్ షెల్టర్ రోడ్డు పెంపుదల సందర్బంగా తొలిగించిన ప్లేస్ లో మళ్ళీ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ షెల్టర్ నిర్మాణానికి సుమారు 3. 5 లక్షలు ఖర్చు. డాక్టర్ గారు గ్రామానికి ఎదో చెయ్యాలి అనే దృఢ సంకల్పం అయన వయసు కూడా తెలియనియదు. అందుకే గ్రామంలో యువత పదుల సంఖ్యలో కూడా అయన వెంటే ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు బస్ షెల్టర్ శంకుస్థాపన కార్యక్రమం లో కాట్రూ శాంతి కిరణ్, మచ్చా సత్యనారాయణ, వుల్లూరి నాని, కుంచె రాజశేఖర్, యలమంచిలి రమేష్ బాబూ, మాకే లోకేష్, పోలామూరి శ్రీనివాస్, కుంచె మహేష్, నాతి సూర్యనారాయణ, పులుసుగంటి శ్రీనివాస్ లతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Sports
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్...
By Avunoori Mahesh 2026-04-18 15:45:51 0 179
Andhra Pradesh
పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు...
By Kothuru Murali 2026-04-26 10:54:12 0 99
Telangana
బహిరంగ సభ ముగించుకొని ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Avunoori Mahesh 2026-06-01 22:42:37 0 253
Telangana
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు...
By Sidhu Maroju 2026-06-09 09:29:42 0 109
Business & Finance
Industrial Parks Expansion Boosts Haryana's Manufacturing Ecosystem
Ganesh Industrial Complex is investing ₹600 crore to develop new industrial parks across Haryana...
By Navya Sree 2026-07-04 08:35:33 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com