అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు

0
239

గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు

ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమశిక్షణతో పరేడ్ నిర్వహించాలని... ప్రముఖుల నుండీ ప్రజలు, విద్యార్థులు పాల్గొనే వేడుకలలో పటిష్ట భద్రత చేపట్టాలని ఆదేశాలు జారీ

అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల పురస్కరించుకుని సోమవారం నిర్వహించే సాయుధ బలగాల పరేడ్ ను మరియు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు సాయుధ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్ల వారీగా పరేడ్‌ను సమగ్రంగా పరిశీలించారు. వి.వి.ఐ.పి తరహాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్, ఎన్.సి.సి క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల కవాతును పరిశీలించి, క్రమశిక్షణతో సమన్వయంగా నిర్వహించాల్సిన విధానాలపై అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు విచ్చేసే వివిఐపీ, వీఐపీ అతిథులకు కూర్చునే సిట్టింగ్ ఏర్పాట్లు, భద్రత, సౌకర్యాలపై ఆరా తీసి లోటుపాట్లు లేకుండా పక్కాగా చేపట్టాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిపబ్లిక్ డే ఉత్సవాన్ని రాష్ట్రంలోనే గుర్తుండిపోయే విధంగా నిర్వహించాలని అధికారులకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు.సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం విద్యార్థినీ విద్యార్థులకు తగిన ఏర్పాట్లు ముందుగానే ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

ఈ ఫుల్ డ్రస్ రిహార్సల్స్‌లో పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్, ఎన్.సి.సి క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలబాలికలు తదితర బృందాలు కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు జాగిలాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా ఎస్పీ గారితో పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు పలువురు ఆర్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెడ్డి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పరిశీలించిన బివి జగనేశ్వర్ రెడ్డి
_*రెడ్డి జనసంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...
By Boya Dasthagiri 2026-03-25 06:11:26 0 239
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 143
Andhra Pradesh
ప్రజాస్వామ్య దేవాలయంలో విద్యార్థుల పర్యటన
*ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు: అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన*   అమరావతి : చట్ట...
By Rajini Kumari 2026-02-13 09:14:22 0 112
Andhra Pradesh
మదనపల్లి: మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడుకి తీవ్ర గాయాలు.
మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్‌లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి...
By Pagadala Venkateswar 2026-02-07 07:01:02 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com