తనయుడి పుట్టినరోజు సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
1K

 

 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ పుట్టిన రోజు సందర్భంగా న్యూ బోయిన్ పల్లి పెన్షన్ లైన్ లోని వాలీబాల్ గ్రౌండ్ లో శ్రీగణేష్ ఫౌండేషన్ తరపున ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కంటి ఆపరేషన్ల కోసం లయన్స్ ఐ హాస్పిటల్ మారేడ్పల్లికి రెండు లక్షల రూపాయల విరాళం కూడా అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. లయన్స్ క్లబ్ మరియు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంపు కు పెద్ద ఎత్తున హజరైన ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ ముకుల్ కు తమ ఆశీర్వాదం అందించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఖరీదయిన వైద్యం చేయించుకోలేని వారి కోసం ఉచితంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకోసం గానూ లయన్స్ ఐ హస్పిటల్ మారేడ్ పల్లికి రెండు లక్షల రూపాయల విరాళం కూడా అందజేసామని, హస్పిటల్ కు భవిష్యత్ లో కూడా అండగా ఉంటానని అన్ని రకాలుగా సహకరిస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. తను ఎమ్మెల్యే అయిన తరువాత సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించలేక పోతున్న కారణంగా ఇక నుంచి ఎస్జీఎఫ్ తరపున సేవా కార్యక్రమాల బాధ్యత తన కుమారుడు ముకుల్ తీసుకుంటున్నాడని ఎమ్మెల్యే తెలిపారు.  ఎమ్మెల్యే కుమారుడు ముకుల్ కూడా తండ్రే తనకు ఆదర్శమని ఆయన మార్గంలో నడుస్తూ ప్రజాసేవ లో చేస్తానని, తన తండ్రి మీద చూపిన ఆదరాభిమానాలు తన మీద కూడా చూపాలని సేవా కార్యక్రమాలను మరింత విసృతం చేయడానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ముకుల్ కు పలువురు నాయకులు, హెల్త్ క్యాంపు వచ్చిన ప్రజలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు..

Search
Categories
Read More
Telangana
చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ సంవత్సర వేడుకలు. కాలనీ టూల్ రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వెంకటాపురం డివిజన్లోని చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్...
By Sidhu Maroju 2025-08-24 15:58:26 0 450
Telangana
బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్...
By Sidhu Maroju 2025-10-27 10:50:08 0 244
Andhra Pradesh
ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.
AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక...
By Pagadala Venkateswar 2026-01-29 11:57:32 0 35
Telangana
భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.
17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది...
By Sidhu Maroju 2025-07-02 13:21:52 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
అన్నమయ్య జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ దాదేం గొల్లపల్లి, దాదేం వెంకటరమణలకు CMRF నిధి నుంచి...
By Kothuru Murali 2026-02-17 08:42:08 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com