భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.

0
1K

17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్‌ లో ఒక వ్యక్తికి గంజాయిని ఇవ్వడానికి బీహార్‌కు చెందిన ఏ. రమేష్‌ కుమార్‌, ఏ చందన్‌ కుమార్‌ ఇద్దరు కలిసి మూడు బాగుల్లో 17 గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్‌ రైళ్లో వచ్చి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో గంజాయి ప్యాకెట్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ డీటీఎప్‌ సీఐ సావిత్రి సౌజన్యతో పాటు సిబ్బంది కలిసి, నిందితులను...గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి తీసుక వచ్చిన ఈ గంజాయిని డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని సికింద్రాబాద్‌ ఏఈఎస్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ గంజాయిని ఎవరికి  ఇవ్వడానికి తీసుక వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను.. గంజాయిని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో సీఐతోపాటు సత్యనారాయణ, ఖలీల్‌, రవి,శిల్పా, పరమేష్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం తో పాటు హైదరాబాద్‌ ఇంచార్జీ డీసీ. అనిల్‌కుమార్‌రెడ్డిలు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు అర్థమయ్యేలా*: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్...
By John Baji 2026-02-05 02:38:10 0 179
Andhra Pradesh
మదనపల్లెలో మిద్దెపై నుంచి పడి భవన కార్మికుడు మృతి.
మంగళవారం మదనపల్లెలో జరిగిన ఘటనలో, నిమ్మనపల్లె మండలం ముస్టూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ (40) అనే...
By Pagadala Venkateswar 2026-02-11 06:03:04 0 88
Andhra Pradesh
స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.
మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో...
By Pagadala Venkateswar 2026-03-12 03:32:00 0 82
Andhra Pradesh
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందచేత !!
కర్నూలు : పాణ్యం నియోజకవర్గానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు రూ 40,46,836/- సీఎం రిలీఫ్ ఫండ్...
By Hari Krishna 2025-12-22 11:27:31 0 158
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com