గూడూరు బస్టాండ్ సర్కిల్ నందు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ధర్నా... కార్మికుల ను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరిక,..,(సీఐటీయూ)

0
1K

మే డే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ గూడూరులో సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో సిఐటియు నాయకులు దానం ఉన్న అధ్యక్షతన కార్మికులతో " " ధర్నా " కార్యక్రమం

నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు డివిజన్ కార్యదర్శి జే,మోహన్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ లక్షలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుంటే అక్కడ ఉన్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పెంట సంస్థలకు అనుకూలంగా వ్యవహరించి వేలాది మంది కార్మికులను బలిగొందని ఆ నెత్తుటి మరకలు నుంచి పుట్టిన ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని పోరాటం చేయడం జరుగుతుందని బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు కార్పొరేటర్ సంస్థలకు ఊడిగం చేయడం కోసం కార్మికుల పైన కక్షగట్టి ఎనిమిది గంటలకు పైగా 10,12,నుండి 14 గంటల వరకు పనులు చేయాల్సిందే అని నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమని, కార్మికులను రోబోలుగా చూస్తున్నారు. 

కానీ కార్మికుల ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకోవడంలేదని, కేవలం లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్న కార్పొరేటు పెట్టుబడిదారుల సంస్థలకు ప్రభుత్వాలు వత్తాసు పలకడం కార్మికులను నాశనం చేయడం, నయా బానిసలుగా చేయడం కోసమే అని అన్నారు,

 మోడీ ప్రభుత్వం చెప్పిందే తడవుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఆపై 12 నుండి 14 గంటలు పని చేయాలి అని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని వెంటనే కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే కార్మికులను రోబోలుగా తయారు చేసే దుర్మార్గమైన విధానాలను మానుకోవాలని లేకుంటే దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు*కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగేష్, మునప్ప, కొమ్మురాజు, హమాలి సంఘం అధ్యక్షుడు కృపానందం, చిరంజీవి,కార్మికులు సుధాకర్, ప్రభుదాస్, జైలు, నవీన్, ప్రదీప్, మరియు హమాలి కార్మికులు పాల్గొన్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సదుం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణకు...
By Kothuru Murali 2026-01-27 05:00:11 0 154
Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam. The court...
By BMA ADMIN 2025-05-19 17:36:23 0 2K
Andhra Pradesh
చిల్లపల్లి శ్రీనివాస్ జన్మదినం: అన్నదానం చేసిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నీరుగుట్టువారిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస...
By Pagadala Venkateswar 2026-02-11 11:22:30 0 108
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)
ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని...
By Vadlamudi NagaVenkat 2026-03-09 11:51:29 0 709
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో పెరిగినచలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 13:22:56 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com