అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.! ట్రోల్ చేసినవారే ఫిదా అవుతున్నారు

0
231

హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పా అని నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నప్పుడు యావరేజ్ గా ఉన్న భామలు చాలా మంది ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డనరీ బ్యూటీస్ గా మారిపోయారు.

 

చాలా మంది హీరోయిన్స్ ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతూ ఉంటారు. కెరీర్ బిగినింగ్ లో యావరేజ్ గా ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు అందాల బొమ్మలుగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలకు కొదవే లేదు నిత్యం పదుల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక స్టార్ హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా అభిమానులను ఆకట్టుకునేలా ఫోటో షూట్స్ తో కవ్విస్తున్నారు. కొంతమంది దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షించేలా క్రేజీ ఫోటో షూట్స్ చేసి నెటిజన్ అవాక్ అయ్యేలా చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 

సందర్భం ఏదైనా సరే ఆ హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులు తెగ పంచుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? టక్కున గుర్తుపట్టలేరు కానీ ఆమె ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతుంది ఆ అమ్మడు.. అలాగే ఈ చిన్నది ఓ స్టార్ హీరో కూతురు.

ఆమె ఎవరో కాదు పాన్ ఇండియా హీరోయిన్ శ్రుతిహాసన్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. అనగనగ ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది శ్రుతిహాసన్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శ్రుతి హాసన్ లుక్ డిఫరెంట్ గా ఉండేది. ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. అయితే ఆమె పై గతంలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కాగా తన ముక్కుకు చిన్నప్పుడు గాయం అయ్యింది. అందుకే సర్జరీ చేయించుకున్నా అని తెలిపింది శ్రుతిహాసన్.

 

#Sivanagendra #Sruthhihasan #Bharataawaz #Panindia News

Search
Categories
Read More
Andhra Pradesh
పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు
BHARAT AAWAZ న్యూస్  పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు  కళ్యాణదుర్గం, తాను...
By Chennaiah Kati 2026-06-10 06:58:51 0 101
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి సందర్శించాడు
ఈరోజు గంజహళ్లి గ్రామాన్ని సందర్శించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి...
By Boya Dasthagiri 2026-05-05 09:31:35 0 141
Telangana
పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!
భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన...
By Sunka Santhosh 2026-07-02 04:39:52 0 109
Andhra Pradesh
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్.
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్ 26-01-2026...
By Pagadala Venkateswar 2026-01-26 06:42:08 0 172
Andhra Pradesh
మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25...
By Pagadala Venkateswar 2026-01-13 07:41:48 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com