నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల

0
1K

సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం లో అవినీతి జరిగిందనే అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అప్పటి మంత్రివర్గ ఉప సంఘం లో తనతో పాటు మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని వారికి అన్ని వాస్తవాలు తెలుసని అన్నారు.బనకచర్ల పై ఆనాడే తాను మాట్లాడానని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ లో కొట్లాడిందే తానని తెలిపారు.కాలేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదని,రిపోర్ట్ ఇస్తారనేది కూడా లేదన్నారు.వెంటనే సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణ ముగిసిన అనంతరం వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో భాజాపా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అవినీతి జరిగితే కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. కాలేశ్వరం కేసీఆర్ నిర్మించింది కాదని జల యజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేశారని అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించాలని వెల్లడించారు. ఈనెల 22 న 11 సంవత్సరాల భాజాప పాలనపై ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరుకానున్నట్లు తెలిపారు. 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో
దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా అందులో దాదాపు సగం (13.1 శాతం)...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:42:34 0 350
Haryana
Six Arrested on Suspicion of Spying for Pakistan, Including One Woman: Indian Army and Police Conduct Joint Operation
Six Arrested on Suspicion of Spying for Pakistan, Including One Woman: Indian Army and Police...
By BMA ADMIN 2025-05-22 05:22:51 0 2K
Andhra Pradesh
మహిళా భద్రతపై అవగాహన: మదనపల్లిలో భారీ 2కే వాకథాన్.
మదనపల్లిలో మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ '2కే...
By Pagadala Venkateswar 2026-03-05 12:09:22 0 78
Andhra Pradesh
పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పసుగణ రంగానికి పునర్ వైభవం
*Press Release*     *పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుగణ రంగానికి పునర్వైభవం*  ...
By Rajini Kumari 2026-01-19 11:18:11 0 105
Andhra Pradesh
విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు
చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:44:24 0 319
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com