ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.

0
1K

జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గిరిగుట్ట ఏఎస్ఐ నన్నేమియా హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా మాణిక్య చారి తన వంతు సహాయంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకులను, అలాగే మానసిక వికలాంగుడికి ఒక సంవత్సరం సరిపడా డైపర్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రంలో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అశోక సంఘం అధ్యక్షులు ఏసుబాబు, మదర్ తెరిసా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రమ, విజయ్ శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
మన దేశం మన ఓటు... అమూల్యమైన ఓటుపై అవగాహన ర్యాలీ... కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లాలో 16వ జాతీయ ఓటర్ అవగాహన ర్యాలీ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,...
By Gangaram Rangagowni 2026-01-25 07:08:46 0 121
Andhra Pradesh
విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సీఎం సమీక్ష
విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సీఎం సమీక్షVER మాస్టర్‌ప్లాన్‌ అజెండాపై...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:36:10 0 206
Andhra Pradesh
జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు...
By Hari Krishna 2026-01-02 15:29:55 0 116
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com