ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.

0
1K

జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గిరిగుట్ట ఏఎస్ఐ నన్నేమియా హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా మాణిక్య చారి తన వంతు సహాయంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకులను, అలాగే మానసిక వికలాంగుడికి ఒక సంవత్సరం సరిపడా డైపర్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రంలో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అశోక సంఘం అధ్యక్షులు ఏసుబాబు, మదర్ తెరిసా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రమ, విజయ్ శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
తాజా వార్త మరో ముగ్గురు తో మంత్రివర్గ కూర్పు
*_నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి...
By Vadla Egonda 2025-06-08 06:17:46 0 2K
Telangana
హర్యానా కమ్యూనిటీ సభ్యులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం. ¡
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ...
By Sidhu Maroju 2026-02-03 04:56:09 0 53
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com