రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు

0
1K

కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి టిజీ భరత్ గారితో కలిసి కర్నూలు ఎం.పీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రూసా నిధులతో అదనపు తరగతుల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ స్థలాలను చూపించి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే చర్యలు తీసుకోవాలని కోరామని తెలియజేశారు. ఉస్మానియా కాలేజీ తో తనకు చాలా అనుబంధం ఉందని 1994- 96 సంవత్సరాల లో ఎంఎస్సీ, బీఈడీ పరీక్షలు ఈ కళాశాలలోనే రాయడం జరిగిందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ముజామిల్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీమతి ఆజ్రా జావేద్, రూస ఇంచార్జ్ డాక్టర్ ఎస్. గజని కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Exhibition
From January 1st 2026 exhibition opening. 
By G k Nookala 2025-12-29 14:21:22 0 232
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 356
Telangana
హర్యానా కమ్యూనిటీ సభ్యులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం. ¡
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ...
By Sidhu Maroju 2026-02-03 04:56:09 0 53
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com