రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు

0
1K

కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి టిజీ భరత్ గారితో కలిసి కర్నూలు ఎం.పీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రూసా నిధులతో అదనపు తరగతుల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ స్థలాలను చూపించి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే చర్యలు తీసుకోవాలని కోరామని తెలియజేశారు. ఉస్మానియా కాలేజీ తో తనకు చాలా అనుబంధం ఉందని 1994- 96 సంవత్సరాల లో ఎంఎస్సీ, బీఈడీ పరీక్షలు ఈ కళాశాలలోనే రాయడం జరిగిందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ముజామిల్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీమతి ఆజ్రా జావేద్, రూస ఇంచార్జ్ డాక్టర్ ఎస్. గజని కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Kerala
Kerala Sees Surge in Women-Led MSMEs, Home-Based Businesses Rise |
Kerala has witnessed the launch of over 350,000 new micro, small, and medium enterprises in the...
By Pooja Patil 2025-09-16 06:13:35 0 47
Telangana
ఉప ఎన్నికలో అభ్యర్థుల హడావిడి.. జాబితా ఖరారు |
హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల...
By Akhil Midde 2025-10-24 10:52:13 0 50
Andhra Pradesh
చిరంజీవి సినిమా రంగంలో 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు |
మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో 47వ సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని...
By Bhuvaneswari Shanaga 2025-09-23 05:45:18 0 33
Andhra Pradesh
అమరావతిలో జాతీయ బ్యాంకుల శంకుస్థాపన |
గుంటూరు జిల్లా అమరావతిలో ఆర్థిక రంగానికి కొత్త ఊపునిచ్చేలా జాతీయ బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం...
By Bhuvaneswari Shanaga 2025-10-22 10:03:25 0 40
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com