Srp 3 గనిలో ఓవర్మెన్ మోసిన్ ఆగడాలని నిరసిస్తూ కార్మికుల ఆందోళన

0
56

తేదీ. 24.07.26 శుక్రవారం రోజున SRP3 గని యందు జనరల్ షిఫ్ట్ ఓవర్ మెన్ మోసిన్ యొక్క ఆగడాలు భరించలేక గని కార్మికులు ఆందోళనకు దిగారు. మోసిన్ యొక్క ఆగడాల గురించి సంబంధిత అధికారులతో పాటు గని మేనేజర్ గారి దృష్టికి కార్మికులు మరియు గుర్తింపు సంఘం నాయకులు తీసుకుపోయారు. అయినను మోసిన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు.

మోసిన్ పై వస్తున్న విమర్శలు : ప్రధానంగా చాలామంది ఉద్యోగులను వారికి కేటాయించిన పని దగ్గర తీవ్రమైన బూతులు, అవమాన కర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా అంటే మీ దిక్కున్న కాడ చెప్పుకోండి నేను ఇలానే మాట్లాడతాను. నన్ను ఎవరు ఏమీ పీకలేరు అంటూ నానా దుర్భాషలాడుతూ కార్మికులను వేధిస్తూ అవహేళనగా మాట్లాడుతున్నాడు. భరించేది లేక కార్మికులు ఆందోళనకు దిగారు. మోసిన్ ఆలస్యంగా అండర్ గ్రౌండ్కు దిగడం డ్యూటీ చివరి సమయంలో పని చెప్పడం, పనులు మార్చడం ఇదేందని అడిగితే నా ఇష్టం నేను ఎవడు చెప్పిన వినను మీరు చేయకపోతే మీ సంగతే చూస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు,

కార్మికుల ప్రధాన డిమాండ్ :ఎస్సార్ పి త్రీ ఉద్యోగులు మోసిన్ ఓవర్మెన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరికి రావాల్సిందే, అవమానపరిచిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందేనని , భేషరతుగా క్షమాపణ చెప్తే తప్ప ఆందోళన విరమించేది లేదని ఓవర్ మెన్ ను జెనరల్ షిఫ్ట్ నుండి తియ్యాలని యాజమాన్యానికి కార్మికులు తెలియచేశారు. మోసిన్ రావాలి క్షమాపణ చెప్పాలి అనే నినాదాలతో ఎస్ఆర్పి త్రీ గని ప్రాంగణం మారు ఓవర్మేన్ మోగింది. తీవ్రమైన ఆందోళనను దృష్టిలో పెట్టుకొని గని మేనేజర్ గారు రెండు రోజులలో మీ సమస్యను పరిష్కరిస్తాను నా మాట వినండి అని గని కార్మికులను కోరారు. మేనేజర్ గారి పైన విశ్వాసంతో ప్రస్తుతం తాత్కాలికంగా ఆందోళనను విరమిస్తున్నామని గని కార్మికులు తెలియజేశారు. మీరిచ్చిన హామీ అమలు జరగకపోతే భారీ ధర్నాతో పాటు తీవ్ర ఆందోళనలు ఉంటాయని మేనేజర్ గారికి కార్మికులు తెలియజేశారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, పిట్ కార్యదర్శి మురళి చౌదరి, పిట్ ఉపాధ్యక్షులు తౌటం మల్లేశ్, సహాయ కార్యదర్శి కారుకూరి నగేశ్, సేఫ్టీ కమిటీ మెంబర్లు నరేష్, కంది శ్రీనివాస్, సాగర్ నాయకులు మహేష్, రమేష్, రాజయ్య ,భోగి గోపి, బొజ్జ రాజయ్య బాధిత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఎన్యుమరేషన్‌పై ఇంటింటి పర్యటన.|
–రాజీవ్ వీకర్ సెక్షన్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన....
By Sidhu Maroju 2026-07-20 09:34:17 0 56
Andhra Pradesh
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...
By Pagadala Venkateswar 2026-03-21 14:15:35 0 166
Andhra Pradesh
యువత మాదక ద్రవ్యాలకి దూరం గా ఉండాలి !
కర్నూలు :కర్నూలు జిల్లా... మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు...
By Hari Krishna 2025-12-24 16:31:17 0 260
Telangana
ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే
దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్...
By Ponnala Srinivasrao 2026-03-06 06:06:14 0 415
Media Academy
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling Podcasts have traditionally...
By Media Academy 2025-05-02 09:24:54 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com