యువత మాదక ద్రవ్యాలకి దూరం గా ఉండాలి !

0
256

కర్నూలు :

కర్నూలు జిల్లా... 

మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ చేయించిన ఈగల్ టీం , కర్నూలు పోలీసులు.

కర్నూలు పట్టణంలో గంజాయి సేవిస్తూ, మత్తుకు  అలవాటుపడి  పట్టుబడ్డ 5 మంది వ్యక్తులకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు  ,కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న డీ – అడిక్షన్ సెంటర్ లో  ఈగల్ టీం, కర్నూలు పోలీసులు కలిసి  కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ చేయించారు. యువకులు సత్ ప్రవర్తన మార్గంలో నడుచుకునే విధంగా కౌన్సిలింగ్ చేసారు.

గంజాయి సేవిస్తూ ఉండడం పై ఆ పిల్లల తల్లిదండ్రులు 1972  కి సమాచారం అందించారు. 

ఎవరైనా డ్రగ్స్, గంజాయి సేవిస్తున్నట్టు తెలిస్తే ఈగల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్ కు  సమాచారం అందించాలని కర్నూలు పోలీసులు తెలిపారు. 

విక్రయించినా, సేవించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కొన్ని హాట్ స్పాట్స్ ను గుర్తించి  200 వరకు కర్నూలు లోని మెడికల్ కళాశాలలు , ఇంజనీరింగ్ కళాశాలలు,  విద్యా సంస్ధలు, డిగ్రీ , ఇంటర్మీడియట్ కళాశాలలో  ఈగల్ టీం మరియు కర్నూలు పోలీసులు కలిసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా  అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

కర్నూలులో 500 మందితో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్దులతో కలిసి  సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 

గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి, భవిష్యత్తులో ఏవిధంగా వారి జీవితాలు పాడవుతాయనే అంశంపై , తల్లిదండ్రులు కష్టపడి చదివించి గొప్పవాళ్ళను చేయాలనుకున్న ఆశలు అడియాశలవుతున్నాయని,వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు.

 ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఎస్సై సుజన్ కుమార్ , ఈగల్ టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
SURAKSHA
ఉన్న రోగుల కోసం తెలంగాణ పోలీసుల రక్తదాన శిబిరాలు
తెలంగాణ పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో అనేక సేవా...
By Kalaga Sailaja 2026-07-01 07:48:43 0 74
Telangana
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ
 తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ...
By Thalakokkula Sadanandam 2026-04-25 08:11:48 0 435
Andhra Pradesh
అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట...
By Pagadala Venkateswar 2026-06-24 04:22:56 0 49
Telangana
నిజామాబాద్: బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ జాద్ ను పరమార్షిన్చినా మజి ఎమ్మెల్యే
నిజామాబాద్:ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న BRS పార్టీ మైనారిటీ నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్...
By Sadaq Sadaq 2026-04-22 16:20:44 0 134
Andhra Pradesh
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*     ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...
By Rajini Kumari 2025-12-22 08:17:54 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com