Madanapalle: మదనపల్లెలో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటన. భద్రత, సభా ఏర్పాట్లపై కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉన్నత స్థాయి సమీక్ష.

0
39

మదనపల్లె: ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా, పరిపాలనా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

సీఎం సెక్యూరిటీ అదనపు ఎస్పీ ఆర్.పి.ఎల్. శాంతికుమార్, డీఎస్పీ కె. శివ పోతురాజు, ఐఎస్‌డబ్ల్యూ అధికారులతో కలిసి హెలిప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం
కర్నూలు !! డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకంతాడేపల్లిగూడెం డా....
By Hari Krishna 2025-12-12 17:23:28 0 315
Andhra Pradesh
భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన...
By Pagadala Venkateswar 2026-07-14 06:48:56 0 35
West Bengal
PM-KISAN: ₹907 Cr Transferred to 45 Lakh Bengal Farmers
In a massive boost to West Bengal's rural economy, over 45.35 lakh farmers across the state have...
By Lokeshwari Panthadi 2026-06-25 12:01:40 0 44
Ladakh
Water Conservation and Glacier Protection in Ladakh
Ladakh is strengthening water conservation and glacier protection measures to address the...
By Fathima Safa 2026-06-24 10:02:11 0 82
Andhra Pradesh
గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను.
గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా...
By Gadiyapudi Narendra 2026-01-10 12:17:17 0 330
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com