SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|

0
56

"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన"

మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై 16: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) సూచించారు. 

ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆల్వాల్ ల్లోని వెంకటాపురం, భూదేవి నగర్, ఖనాజీగూడ డివిజన్‌ల బీఆర్ఎస్ బీఎల్ఏలతో శుభశ్రీ గార్డెన్, శ్రీ సత్యసాయి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన అవగాహన, సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

SIR కార్యక్రమం అమలు తీరును సమీక్షించి, క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

2002 ఓటరు జాబితాలో పేరు లేని అర్హుల నమోదు, ఒకే కుటుంబంలోని సభ్యుల పేర్లు జాబితాలో లేకపోతే అనుసరించాల్సిన విధానం, ECINET పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌లు అందకపోవడం, వృద్ధులకు ఫారమ్‌లు చేరకపోవడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6, మరణించిన లేదా డబుల్ నమోదైన ఓటర్ల పేర్ల తొలగింపుకు ఫారం-7, పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాల సవరణకు ఫారం-8 వినియోగంపై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఇంటికి చేరుకుని ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీని పూర్తి చేసి, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎల్ఏలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశాల్లో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు తోట నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
*కేరళలో సైకిల్‌ తొక్కుతూ రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం*    లోక్‌సభలో...
By Rajini Kumari 2026-03-31 17:02:53 0 151
Andhra Pradesh
మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా...
By Pagadala Venkateswar 2026-03-01 09:42:22 0 166
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల కొరత తీరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తక్షణమే స్పందించి DEO, MEO లతో మాట్లాడి టీచర్.
వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవకు...
By Pagadala Venkateswar 2026-07-22 11:37:37 0 22
Telangana
ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన
         మెదక్ జిల్లా:  మెదక్  నియోజకవర్గ ప్రజల సమస్యలను...
By Sidhu Maroju 2025-08-24 14:49:40 0 503
Andhra Pradesh
YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల.
ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడమేంటని షర్మిల ప్రశ్న   సంగమేశ్వరం బదులు...
By Pagadala Venkateswar 2026-02-07 09:45:16 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com