హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు.|

0
92

'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు"

మేడ్చల్ మల్కాజిగిరి :మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవనంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

కౌకూర్, మీర్జల్‌గూడ, ఏఎస్‌రావు నగర్ పరిసర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రహదారుల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

కౌకూర్‌లో శ్యామల లక్ష్మీనగర్, డాక్టర్స్ కాలనీ, విలాస్ స్ప్రింగ్ కాలనీలపై ప్రభావం చూపుతున్న 60 మీటర్ల ప్రతిపాదిత రహదారిని తొలగించాలని, మీర్జల్‌గూడ–చిన్మయ మార్గ్‌లో ప్రతిపాదించిన 60 అడుగుల రహదారిని 30 అడుగులకు కుదించాలని కోరారు. 

అలాగే ఏఎస్‌రావు నగర్ నుంచి నేరేడ్మెట్ వరకు ప్రతిపాదించిన 100 అడుగుల రహదారిని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని కోరారు. ఈ ప్రతిపాదనల వల్ల స్థానిక ప్రజలు, ఆస్తి యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఇదే సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో సీఆర్‌ఎంపీ రోడ్ల నిర్మాణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రాలపై హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రజలకు అనుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి...
By Sadaq Sadaq 2026-02-07 15:51:26 0 204
Chhattisgarh
Chhattisgarh's Krishak Unnati Yojana Boosts Rural Economy
Agriculture continues to anchor Chhattisgarh’s economic strategy, underscored by the robust...
By Lokeshwari Panthadi 2026-06-26 12:14:08 0 71
Andhra Pradesh
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
By Patan Khuddus 2026-05-08 15:26:30 0 771
Andhra Pradesh
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-03-16 05:45:21 0 232
Andhra Pradesh
చేనేతల ద్రోహి మాజీ ఎంపీ బుట్టా రేణుక
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు...
By Boya Dasthagiri 2026-04-04 03:32:18 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com