జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లన్న సార్ గారికి వినతి

0
80

 టిడిపి మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్ప పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లప్ప గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ భాష డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ , బాలు మాట్లాడుతూ...* కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో పాఠశాల స్థలాన్ని కబ్జాజేసి బెదిరింపులకు పాల్పడిన మాజీ సర్పంచ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.

 దొడ్డనకేరి జడ్.పి.హెచ్. హైస్కూల్ పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలనాయకులుగా దొడ్డనకేరి జడ్.పి.హెచ్. హైస్కూల్ మైదానంలో సుమారు 11సెంట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని తెలిసి, పాఠశాల పరిరక్షణ బాధ్యతతో అక్కడికి వెళ్లి సంబంధిత వివరాలు తెలుసుకున్నాము.గ్రామంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశాము. అనంతరం మా వద్ద ఉన్న ఆధారాలతో 06/07/2026 తేదీ న ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు సమర్పించాము.ఈ విషయంపై మాజీ సర్పంచ్ శివప్ప గారు ప్రెస్ మీట్ నిర్వహించి, పాఠశాల స్థలాన్ని కాపాడేందుకు ధర్నాలు, ర్యాలీలు చేస్తే కొడకల్లారా కాళ్లు చేతులు నరుకుతా అంటు బహిరంగంగా మీడియా ఎదుట మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా, మా పాఠశాల పూర్వ విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడటం జరిగింది. ఈ చర్యల వల్ల మాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ప్రభుత్వ పాఠశాల ఆస్తిని పరిరక్షించాలనే ఉద్దేశంతో చట్టబద్ధంగా అధికారులను ఆశ్రయించిన మాపై ఈ విధంగా బెదిరింపులు చేయడం చట్టవిరుద్ధమైన చర్య.మాకుటుంబాలు అన్ని తీవ్ర ఆందోళనకు చెందుతున్నాయి. అందువల్ల ఈ సంఘటనపై మీరు దీని పై స్పందించి మాజీ సర్పంచ్ శివప్ప గారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ విద్యార్థి సంఘాల నాయకులు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు శేఖర్ మోహన్ హరి రఘు వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో...
By Kothuru Murali 2026-06-04 14:42:13 0 82
Andhra Pradesh
Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద!!!!
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో...
By SivaNagendra Annapareddy 2025-12-20 05:05:41 0 231
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 172
SURAKSHA
AP Police 108 Emergency Response Saves Accident Victim Life
Guntur lo road accident jarigina ventane AP Police 108 ki call chesi injured person ni hospital...
By Kalaga Sailaja 2026-07-01 04:39:13 0 88
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్...
By Chennaiah Kati 2026-07-05 14:22:03 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com