రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!

0
276

మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు దిగువ  పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ట్రస్ట్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన గుంజేడు ముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పుల్సం సురేష్ తన సొంత ఖర్చులతో JCB యంత్రాలను రప్పించి కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులను చేపట్టారు. ఈ సందర్భంగా పుల్సం సురేష్ మాట్లాడుతూ, మంత్రి సీతక్క  ఆదేశాల మేరకు "రైతు సమస్య అంటే అది ప్రజా పాలన ప్రభుత్వ సమస్య. ప్రభుత్వం నిధులు విడుదల చేసేలోపు పంట దెబ్బతింటుంది. అందుకే సీతక్క ఆదేశాల మేరకు ముందుగా మేమే ముందుకు వచ్చి కాలువలను శుభ్రం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కాలువల్లో కూడా పూడిక తొలగిస్తాం" అని తెలిపారు.

రైతుల హర్షం
  
ట్రస్ట్ బోర్డ్ చొరవను స్థానిక రైతులు అభినందించారు. "ముసలమ్మ ట్రస్ట్, సురేష్ అన్న లేకపోతే మా పంటలు నష్టపోయేవి. ఇప్పుడు కాలువ క్లీన్ కావడంతో నీరు సాఫీగా పొలాలకు వెళ్తుంది" అని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డ్ మెంబర్ గుంట అరుణ సూర్యం, నర్సింగరావు, బుచ్చి రాములు, పవన్ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Community Policing Builds Trust Between Karnataka Police and Public
Karnataka Police follows community policing to build public trust. Monthly ‘Police Meet...
By Kalaga Sailaja 2026-07-01 11:53:37 0 129
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Business & Finance
Heavy Rains Disrupt Construction Activity in Bharuch
Heavy monsoon rains triggered a wall collapse at the under-construction World Trade Centre site...
By Navya Sree 2026-07-01 07:32:18 0 61
Andhra Pradesh
పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్...
By Kothuru Murali 2026-05-23 14:13:50 0 75
Madhya Pradesh
Dhar Water Crisis: Women Brave 50-Foot Ravine
Despite ₹430 crore spent on pipeline infrastructure in Dhar district, a severe drinking water...
By Tejaswini Komanduru 2026-06-15 08:33:38 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com