కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.

0
1K

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఈరోజు వార్డు 5 జ్యోతి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీవాసులు తమకు కనీస అవసరాలు అయిన చెత్త సేకరణ, నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, భూగర్భ డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం తదితర పనులను బోర్డు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిపించుకుని వారి సమస్యలను వివరించి త్వరగా వీటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.అనంతరం కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన ఇలాంటి చిన్న చిన్న పనులను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవలసి వస్తుందని, అదే బోర్డు ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రతి వార్డుకు ఒక ప్రజా ప్రతినిధి ఉంటాడని, అతను ఇలాంటి చిన్న చిన్న సమస్యలను బోర్డు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని, గతంలో ఇక్కడ వార్డు సభ్యులుగా, నామినేటెడ్ సభ్యులుగా పని చేసిన వారు పదవులపై ఉన్న శ్రద్ధను ప్రజలకు సేవ చేయడంలో చూపించలేదని, అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచించుకుని వారికి అందుబాటులో ఉండే వారిని ఎన్నికలలో ఎన్నుకుంటే ఈ సమస్యలు ఉండవని, నేను నిత్యం అందుబాటులో ఉంటానని, అలాగే బోర్డు ఎన్నికలు నిర్వహించినట్లయితే సమర్ధులకు, నిత్యం అందుబాటులో ఉండే వారికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని కాలనీ వాసులకు సూచించారు.

Like
1
Search
Categories
Read More
Jharkhand
Jharkhand Coal Minister Announces Wage & Safety Reforms for Workers
The #CoalMinister in #Jharkhand announced improved wages and working conditions for coal...
By Pooja Patil 2025-09-13 11:38:14 0 73
Andhra Pradesh
ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి
మునగల పాడు కర్నూల్ మండలం ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి...
By mahaboob basha 2025-10-17 11:04:45 0 64
BMA
What is Bharat Media Association (BMA)?
Empowering Media Professionals Across India!!The Bharat Media Association (BMA) is a...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:09:31 0 2K
Andaman & Nikobar Islands
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security Port Blair...
By BMA ADMIN 2025-05-22 12:48:14 0 2K
Andhra Pradesh
రూ.13,400 కోట్లతో కర్నూలులో అభివృద్ధి శంకుస్థాపన |
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు ఓర్వకల్‌...
By Bhuvaneswari Shanaga 2025-10-16 04:35:26 0 131
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com