బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.

0
46

బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.

మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు.డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

దొనకొండ మండలం ఇండస్ట్రియల్ కారిడార్ లో జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారి తో కలిసి శుక్రవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ డి.ఆర్.డి.ఏ అధికారులతో పర్యటించారు.

ఈ సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో వెనుకబడిన దొనకొండలో పారిశ్రామిక అభివృద్ధికి బీడీఎల్ ప్రాజెక్టు ఏర్పాటుకు చొరవ తీసుకోవడం ఆయనకు ప్రత్యేకంగా దర్శి ప్రాంత ప్రజానీకం తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

బిడిఎల్ రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడునున్నాయని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.

వందలాది మంది నిరుద్యోగులకు బీడీఎల్ పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తుంది అన్నారు.

ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం అందించేందుకు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని తొలి అడుగు వేయడం అభినందనీయమన్నారు.

వెంటనే బీడీఎల్ పరిశ్రమకు అవసరమైన భూమిని అందించేందుకు అడ్డంకులు తొలగించి ముందుకు వెళ్లాలన్నారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దొనకొండలో వలసలు నివారించి అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషిని అందరం అభినందించాలన్నారు.

రాబోయే ఐదేళ్లలో దొనకొండ దశ దిశ మార్చే లక్ష్యంగా బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటు జరుగుతుందన్నారు.

ఇందుకు సహకరిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలకు డాక్టర్ లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ.. ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో దొనకొండలో బీడీల్ ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని అందించాలని కోరడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే డి.ఆర్.డి.ఏ అధికారులతో స్థల పరిశీలన చేయడం జరిగిందని వెంటనే స్థలాన్ని వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు . బీడీఎల్ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా అనుబంధ పరిశ్రమల ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తద్వారా ఉపాధి జరుగుతుందన్నారు. అందులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి కృషి కూడా ఉందని కలెక్టర్ తెలిపారు. వెంటనే స్థలాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు.

ఈ కార్యక్రమం లో దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, నాగులపాటి శివకోటేశ్వర రావు, కామేపల్లి చెంచయ్య, మోడీ ఆంజనేయులు, రమణ యాదవ్, దొనకొండ మండలం మరియు నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Karnataka
Bengaluru’s Tech Prowess: "The World is Watching"
In a major boost to the state’s economic morale, Deputy CM D.K. Shivakumar hailed Bengaluru...
By Dunna Jessicaruth 2026-05-14 09:41:42 0 122
Andhra Pradesh
పట్టాభిపురంలో వ్యభిచార నిర్వహణపై టాస్క్ ఫోర్స్ రైడ్
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పండరీపురం, 5వ లైను నందు ఆర్గనైజింగ్ వ్యభిచారం...
By John Baji 2026-01-25 02:10:40 0 210
Telangana
పెద్దపల్లి : పట్టాలు తప్పిన ట్రైన్....!
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ సమీపంలో గౌరెడ్డిపేట రైల్వే గేటు దాడిన అనంతరం...
By Sunka Santhosh 2026-06-09 18:27:58 0 82
Business & Finance
Director Identification Number Secures Compliance
A Director Identification Number (DIN) is a unique identification number issued by the Ministry...
By Navya Sree 2026-07-10 05:19:30 0 73
Andhra Pradesh
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :  యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
By Hari Krishna 2025-12-24 14:44:23 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com