భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.

0
58

 

భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

 

Andhra

AP High Court key ruling on building construction permits

భవన నిర్మాణ అనుమతులు నిరాకరించే అధికారం పంచాయతీలకు లేదన్న హైకోర్టు

భూమి యాజమాన్య వివాదాలను సివిల్ కోర్టులే తేల్చాలని వెల్లడి

కేవలం లీగల్ నోటీసు ఆధారంగా అనుమతి నిరాకరించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్య

నంద్యాల జిల్లా వాసి పిటిషన్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు

15 రోజుల్లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం

భూమి యాజమాన్య హక్కులకు (టైటిల్) సంబంధించిన వివాదాలు ఉన్నాయనే కారణంతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి వివాదాలను పరిష్కరించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి కీలక తీర్పు వెలువరించారు.

 

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురానికి చెందిన కె. జమాల్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ టైటిల్‌ను ప్రశ్నిస్తూ మూడో పక్షం ఇచ్చిన లీగల్ నోటీసును ప్రాతిపదికగా తీసుకుని, భవన నిర్మాణ అనుమతిని నిరాకరిస్తూ 2023 డిసెంబర్ 24న గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని న్యాయస్థానం రద్దు చేసింది.

 

కేసు వివరాల్లోకి వెళితే.. జమాల్ రెడ్డి 2009లో సర్వే నంబర్ 408లో 4 సెంట్ల (195.5 చదరపు గజాలు) స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆయన ఇంటి పన్ను చెల్లిస్తూ అక్కడే నివసిస్తున్నారు. తన పాత కట్టడాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించుకోవడానికి అనుమతి కోరగా, పంచాయతీ కార్యదర్శి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి స్పందించిన పిటిషనర్, భవన నిర్మాణానికి అవసరమైన ప్లాన్, చలాన్ పత్రాలను సమర్పించారు.

 

2009 నాటి సేల్ డీడ్ చెల్లదంటూ విక్రయదారుల సోదరుడి వారసులు 2023 డిసెంబర్‌లో లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసును సాకుగా చూపి పంచాయతీ అధికారులు నిర్మాణ అనుమతి దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. దాదాపు 16 ఏళ్లుగా సదరు వివాదంపై సివిల్ కోర్టును ఆశ్రయించని వారి నోటీసు ఆధారంగా అనుమతిని నిరాకరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. దరఖాస్తుదారుడి పేరు మీద టైటిల్ ఉందా లేదా, భూమి ఆయన స్వాధీనంలో ఉందా అనే అంశాలను మాత్రమే పంచాయతీలు పరిశీలించాలని సూచించింది. ఈ నేపథ్యంలో, 15 రోజుల్లోగా జమాల్ రెడ్డి దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.                                

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
By Kothuru Murali 2026-02-26 12:35:09 0 125
Andhra Pradesh
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
By Kothuru Murali 2026-05-09 15:02:41 0 115
Andhra Pradesh
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం !!
కర్నూలు : బిజెపి నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ జబిన్ నియమితులయ్యారు. పార్టీ...
By Hari Krishna 2025-12-14 12:28:16 0 296
Telangana
నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి
  ‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో...
By Ponnala Srinivasrao 2026-03-02 10:55:38 0 519
Tamilnadu
Tamil Nadu Accelerates Industrial Corridors and Logistics
Tamil Nadu continues to strengthen its industrial corridors and logistics network through major...
By Fathima Safa 2026-06-29 10:20:34 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com