గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|

0
72

"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్"

హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రులు, రాజ్యసభ సభ్యుడు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. 

ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందిస్తామని, ప్రజాపాలనలో సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం
*గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎలా బడితే అలా బయటకు వెళ్ళటం కుదరదు అధికారి పర్మిషన్ తప్పనిసరి*...
By Rajini Kumari 2025-12-28 09:33:45 0 183
Andhra Pradesh
కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై...
By Benguluri Madhubabu 2026-03-10 13:55:33 0 189
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి...
By Avunoori Mahesh 2026-04-06 17:03:57 0 293
Andhra Pradesh
భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.
  భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-06-24 04:28:11 0 44
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పుంగునూరు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి
పుంగనూరు నియోజకవర్గం, కల్లూరు బంగ్లా వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-02-15 07:11:55 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com