C M Revanth reddy meets Amith Shah in Delhi

0
87

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర హోం శాఖ మంత్రి గారితో భేటీ అయ్యారు. 

 

✅ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2016లో మొద‌టి క్యాడ‌ర్ రివ్యూ జ‌రిగింద‌ని, 2021లో జ‌ర‌గాల్సిన క్యాడ‌ర్ రివ్యూ చాలా ఆల‌స్యంగా 2025లో జ‌రిగింద‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఆ స‌మ‌యంలోనూ కేవ‌లం ఏడుగురు ఐపీఎస్ అధికారుల‌ను మాత్ర‌మే తెలంగాణ‌కు కేటాయించార‌ని తెలిపారు.

 

✅ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో ఐపీఎస్ అధికారుల అవ‌స‌రం ఉంద‌ని వివరించారు.

 

✅ మూడో క్యాడ‌ర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవ‌త్స‌రంలోనే చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నార‌ని, ఆ సంఖ్య‌ను 103కు పెంచి కేటాయించాల‌ని కోరారు. 

 

✅ ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షా గారితో చ‌ర్చించారు. ఇటీవ‌ల మావోయిస్టు అగ్ర నాయ‌కుల లొంగుబాటు, వారి పున‌రావాసం అంశాలు చర్చించారు. గత రెండేళ్ల‌లో తెలంగాణ పోలీసింగ్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. 

 

✅ రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వ‌చ్చార‌ని, వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం అంద‌జేస్తున్న ప‌రిహారం, పున‌రావాసం విష‌యాల‌ను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి గారు వివరించారు.

 

✅ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించి స‌హ‌క‌రించాల‌ని కూడా కోరారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి గారు, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు, ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Sports
2nd Test Day 1
Indian skipper Shubman Gill stars for Team India as he scored his 7th Test century in spectacular...
By Bharat Aawaz 2025-07-02 17:53:09 0 2K
Telangana
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం..
PM Narender modi .... March 27 Today 6:30 pm 
By Sunka Santhosh 2026-03-27 12:07:27 0 154
Andhra Pradesh
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.
AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-01-24 10:08:18 0 105
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 400
Business EDGE
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By Business EDGE 2025-04-30 04:55:42 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com