C M Revanth reddy meets Amith Shah in Delhi

0
251

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర హోం శాఖ మంత్రి గారితో భేటీ అయ్యారు. 

 

✅ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2016లో మొద‌టి క్యాడ‌ర్ రివ్యూ జ‌రిగింద‌ని, 2021లో జ‌ర‌గాల్సిన క్యాడ‌ర్ రివ్యూ చాలా ఆల‌స్యంగా 2025లో జ‌రిగింద‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఆ స‌మ‌యంలోనూ కేవ‌లం ఏడుగురు ఐపీఎస్ అధికారుల‌ను మాత్ర‌మే తెలంగాణ‌కు కేటాయించార‌ని తెలిపారు.

 

✅ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో ఐపీఎస్ అధికారుల అవ‌స‌రం ఉంద‌ని వివరించారు.

 

✅ మూడో క్యాడ‌ర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవ‌త్స‌రంలోనే చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నార‌ని, ఆ సంఖ్య‌ను 103కు పెంచి కేటాయించాల‌ని కోరారు. 

 

✅ ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షా గారితో చ‌ర్చించారు. ఇటీవ‌ల మావోయిస్టు అగ్ర నాయ‌కుల లొంగుబాటు, వారి పున‌రావాసం అంశాలు చర్చించారు. గత రెండేళ్ల‌లో తెలంగాణ పోలీసింగ్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. 

 

✅ రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వ‌చ్చార‌ని, వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం అంద‌జేస్తున్న ప‌రిహారం, పున‌రావాసం విష‌యాల‌ను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి గారు వివరించారు.

 

✅ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించి స‌హ‌క‌రించాల‌ని కూడా కోరారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి గారు, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు, ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టుపై వృద్ధ దంపతులను టార్గెట్
కృష్ణాజిల్లా   మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేసే యత్నం   ...
By Rajini Kumari 2026-02-28 12:49:35 0 145
Andhra Pradesh
దోర్నాల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు ప్రారంభించారు ప్రారంభాలు చేశారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్నారు
దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-01-11 13:15:04 0 288
Andhra Pradesh
మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరిక.
మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)...
By Shyamala Yadagiri 2026-04-28 00:34:00 0 200
Telangana
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్ వార్డు 1 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు....
By Sidhu Maroju 2025-07-10 05:53:41 0 1K
Uttar Pradesh
Varanasi's Global Leap: First Major Biscuit Export to Oman
In a historic milestone for Uttar Pradesh’s food processing sector, Varanasi has...
By Lokeshwari Panthadi 2026-06-29 08:28:55 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com