క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|

0
93

"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.

కొత్తగా ఓటర్లుగా నమోదు కావాల్సిన వారు, పేర్లు సవరించుకోవాల్సిన వారు, చిరునామా మార్పులు లేదా ఇతర వివరాల సవరణ అవసరమున్న వారు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ ఫారాల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగాలని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. 

ప్రజలు కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

–Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
కాకినాడ జిల్లా                   ప్రత్తిపాడు...
By BABJI DADALA 2026-03-12 20:59:00 0 491
Andhra Pradesh
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-28 06:07:27 0 187
Andhra Pradesh
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు.
పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-04-10 06:06:50 0 111
Andhra Pradesh
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
By Chennaiah Kati 2026-07-05 14:17:42 0 59
Andhra Pradesh
దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల...
By Rajini Kumari 2026-04-13 07:57:14 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com