ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి.

0
42

 

ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి

25-06-2026 Thu 11:22

Andhra

Kiran Kumar Reddy says current politics have degraded

రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి

సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ

టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేటి రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు పర్యటనలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్, టీవీ డిబేట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతిపై తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఒకప్పుడు రాజకీయాలు పాలసీ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవని, ఇప్పుడు కేవలం వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయని చెప్పారు.

 

 

 

సమాజంలో మిగిలిన ప్రొఫెషన్స్‌తో పోలిస్తే రాజకీయాల్లో విలువలు దారుణంగా పడిపోతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. "డాక్టర్లు, న్యాయవాదులు వంటి వృత్తుల్లో ఉన్నవారు కోర్టుల్లోనో, బయటో ఎంత వాదించుకున్నా ఒకరినొకరు వ్యక్తిగతంగా గౌరవించుకుంటారు. అవసరమైనప్పుడు పరస్పరం మద్దతు ఇచ్చుకుంటారు. కానీ, రాజకీయాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. సిద్ధాంతాలు పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం ఎక్కువవుతోంది" అని విమర్శించారు.

 

 

 

ప్రస్తుత మీడియా కల్చర్‌పై కూడా మాజీ సీఎం గట్టిగానే కౌంటర్ వేశారు. "ఇప్పుడు వస్తున్న టీవీ డిబేట్లను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూసే పరిస్థితి అస్సలు లేదు. ఆ చర్చల్లో వాడే భాష, అరచుకునే విధానం చూస్తే.. అసలు టీవీనే ఆఫ్ చేసేయాలనే అంతటి విరక్తి కలుగుతోంది" అని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్య పదజాలం, ట్రోలింగ్ సంస్కృతి ఏమాత్రం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

 

 

 

రాజకీయాలు అంటే ప్రజలకు సంబంధించినవని, అక్కడ వ్యక్తిగత అజెండాలకు తావుండకూడదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న గ్రౌండ్ లెవెల్ సమస్యలపై అసెంబ్లీల్లో, బయట చర్చలు జరగాలే తప్ప.. వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాల స్థాయిని దిగజార్చవద్దని లీడర్లకు సూచించారు. నాయకుల మధ్య పరస్పర గౌరవం లేకపోవడం వల్లే పబ్లిక్‌లో రాజకీయ విలువల గ్రాఫ్ క్షీణిస్తోందని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ :   బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక...
By Sidhu Maroju 2025-09-23 09:02:33 0 314
Bharat Aawaz
India's Systemic Crisis: Education Cancer & Security Risks
India's education system is experiencing a crisis akin to stage-4 cancer. Consecutive failures...
By Hazu MD. 2026-06-06 09:57:54 0 277
Andhra Pradesh
నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.
మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం...
By Pagadala Venkateswar 2026-04-13 05:49:18 0 148
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-04-10 12:11:59 0 107
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు...
By Sidhu Maroju 2025-11-28 13:50:08 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com