"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|

0
92

సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 14న ప్రత్యేక బృందం క్లూస్ టీమ్, స్వతంత్ర సాక్షులతో కలిసి దేవకి లాడ్జ్‌లో సోదాలు నిర్వహించింది. 

ఈ సందర్భంగా బీహార్‌కు చెందిన రిషి కుమార్ (23)తో పాటు 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని వారి సామాను తనిఖీ చేయగా, 13 ప్యాకెట్లలో ఉన్న 17 కిలోల గంజాయి లభ్యమైంది.

విచారణలో నిందితులు ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని పూణేకు హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో ప్రధాన సరఫరాదారుగా భావిస్తున్న బీహార్‌కు చెందిన విజయ్ అలియాస్ సంభవ్ కుమార్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

గంజాయితో పాటు నిందితులు ఉపయోగిస్తున్న రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

మల్కాజిగిరి జోన్ డీసీపీ C. శ్రీధర్ , ఏసీపీ యాదగిరి రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న గోపాలపురం పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
M. Janaki IAS: A Visionary Leader in Public Governance
A distinguished IAS officer of the Andhra Pradesh cadre, Shri M. Janaki has earned a reputation...
By Lokeshwari Panthadi 2026-07-16 11:59:26 0 75
Andhra Pradesh
వేసవి రాకముందే నీటి ఎద్దడి..
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో...
By Boiena Rajesh 2026-03-04 10:48:38 0 180
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
By Gadiyapudi Narendra 2025-12-26 14:50:45 0 244
Andhra Pradesh
పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలపై బాధితుల ఆరోపణలు.
మదనపల్లె మండలం కోళ్లబైలు కాలనీలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకుల పేరు...
By Pagadala Venkateswar 2026-06-08 15:43:29 0 56
Andhra Pradesh
స్మశాన వాటిక కబ్జాపై కలెక్టరేట్ ఎదుట నిరసన.
మదనపల్లె మండలం కొత్తపల్లి గ్రామంలోని సందిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న స్మశాన వాటికను చంగల్ రాయుడు,...
By Pagadala Venkateswar 2026-06-08 15:50:53 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com