కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|

0
144

సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో ఆసుపత్రికి వెళ్తున్న వృద్ధ దంపతుల కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. మహేంద్ర హిల్స్ కు చెందిన మారుతి జయలక్ష్మి దంపతులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ కు బయలుదేరారు. ఆహారం తీసుకోకుండా ఇంట్లో నుండి రావడంతో వాహనాన్ని నడుపుతున్న మారుతి కి చక్కెర వచ్చి కళ్ళు తిరగడంతో బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ ను నొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో వృద్ధ దంపతులు బయటపడినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. వెంటనే డివైడర్ను ఢీ కొట్టిన కారును రహదారిపై నుండి తప్పించి వారిని సురక్షితంగా ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. వాహనం నడుపుతుండగా కళ్ళు తిరగడంతోనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో ప్రమాదం జరిగిందని మారుతి చెప్పారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ 28-01-2026 Wed 07:04 | Both...
By Pagadala Venkateswar 2026-01-28 06:44:38 0 42
Andhra Pradesh
క్యాన్సర్ రాకుండా 2300 మందికి విద్యార్థులకు ఉచిత వ్యాక్సిన్ApMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
*క్యాన్సర్ రాకుండా 2,300 మంది విద్యార్థినిలకు ఉచిత వ్యాక్సిన్*   *మహిళ సాధికారత కోసం రోటరీ...
By Rajini Kumari 2026-01-20 11:02:00 0 58
Andhra Pradesh
పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన – వ్యక్తికి తీవ్ర గాయాలు
తుని పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో...
By Ratna Sekhar 2026-02-18 09:10:25 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com