కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|

0
198

సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో ఆసుపత్రికి వెళ్తున్న వృద్ధ దంపతుల కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. మహేంద్ర హిల్స్ కు చెందిన మారుతి జయలక్ష్మి దంపతులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ కు బయలుదేరారు. ఆహారం తీసుకోకుండా ఇంట్లో నుండి రావడంతో వాహనాన్ని నడుపుతున్న మారుతి కి చక్కెర వచ్చి కళ్ళు తిరగడంతో బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ ను నొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో వృద్ధ దంపతులు బయటపడినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. వెంటనే డివైడర్ను ఢీ కొట్టిన కారును రహదారిపై నుండి తప్పించి వారిని సురక్షితంగా ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. వాహనం నడుపుతుండగా కళ్ళు తిరగడంతోనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో ప్రమాదం జరిగిందని మారుతి చెప్పారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-25 12:02:46 0 117
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్...
By Pagadala Venkateswar 2026-03-07 05:59:59 0 87
Andhra Pradesh
చీరాల అభివృద్ధి మా కర్తవ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు....
By Vadlamudi NagaVenkat 2026-03-16 13:19:26 0 573
Technology
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India...
By BMA ADMIN 2025-05-22 18:14:35 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com