ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనపై ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో అవగాహన సదస్సు

0
139

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకంపై ఈరోజు ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ…ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా యువతకు, ఉద్యోగార్థులకు మరియు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాధితులకి నిత్యవసర సరుకులు 6 వేలు ఆర్థిక సాయం
*బాధితునికి నిత్యావసర సరుకులు, రూ.6 వేల ఆర్థిక సాయం అందజేత*    *మంగళగిరి:* గత...
By Rajini Kumari 2025-12-29 09:30:46 0 198
SURAKSHA
Rajarshi Shah, IAS: Leading Adilabad with Purpose
A Young IAS Officer Transforming District Administration Through Transparent Governance,...
By Lokeshwari Panthadi 2026-07-14 08:24:38 0 119
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, భీమ గాని పల్లి కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద బైరెడ్డిపల్లి మండలం...
By Kothuru Murali 2026-02-08 10:13:44 0 183
Andhra Pradesh
రాహుల్ ఫెయిల్ అయ్యాడు ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి
బిగ్ బ్రేకింగ్!   రాహుల్ ఫెయిల్ అయ్యాడు, ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి:...
By Rajini Kumari 2025-12-24 10:32:44 0 211
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా...
By Kothuru Murali 2026-04-05 07:43:50 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com