ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్

0
81

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్

కర్నూలులో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడి

రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కర్నూల్‌లో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.

 

కర్నూల్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని, మొత్తం 1,460 ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఓర్వకల్లుకు ఎన్నడూ లేనంతగా పరిశ్రమలు వస్తున్నాయని, రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామని వెల్లడించారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అమలైతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి అభివృద్ధి సాధిస్తుందని మంత్రి భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఇజ్రాయెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ.
ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం సాంకేతిక సహకారం అందించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-21 14:44:30 0 160
Andhra Pradesh
స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000...
By Pagadala Venkateswar 2026-04-08 05:48:05 0 132
Gujarat
Gujarat Tourism & Culture Boosts Heritage and Global Appeal
Gujarat is rapidly emerging as a major tourism and cultural hub of India, blending heritage,...
By Fathima Safa 2026-06-29 12:36:00 0 80
Andhra Pradesh
Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు.
      Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్...
By Pagadala Venkateswar 2026-04-02 06:11:16 0 156
Business & Finance
Launch Your Business Faster with a Trusted Partnership
A partnership firm is an excellent choice for entrepreneurs who want to start and manage a...
By Navya Sree 2026-07-18 04:46:33 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com