శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.

0
249

సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంసారీ బజార్ చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి ప్రహరీ గోడదూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారీ బజారుకు చెందిన రామచందర్ అనే వృద్ధుడి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్ నగర్ కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ గూడ దూకిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాతారాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50 వేల నగదు అపహరణ చేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణమూర్తి వెల్లడించారు. 2011లో కూడా తమ ఇంట్లో ఇదే విధంగా చోరి అప్ప్పుడు కూడా 8తులాల బంగారం, అరకిలో వెండి నగదు చోరీ జరిగిందని, ఇప్పటి వరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, మళ్ళీ అదే తరహా చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Mizoram
Mizoram Expands Governance and Digital Public Services
Mizoram continues to strengthen governance through the expansion of digital public services,...
By Fathima Safa 2026-07-01 11:04:47 0 42
Andhra Pradesh
క్యూఆర్ కోడ్ ఆధారత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ఒకటి రెండు మూడు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
విజయవాడ నగరపాలక సంస్థ 16-05-2026     *క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్...
By Rajini Kumari 2026-05-16 14:42:33 0 109
Telangana
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై...
By Sidhu Maroju 2026-05-11 11:15:16 0 569
Andhra Pradesh
ఓటర్ జాబితా సవరణ పై సీఎం చంద్రబాబు కీలక భేటీ
*ఓటరు జాబితా సవరణపై సీఎం చంద్రబాబు గారు కీలక భేటీ*   గుంటూరు జిల్లా, మంగళగిరి, టీడీపీ...
By Rajini Kumari 2026-06-02 12:36:30 0 221
Andhra Pradesh
శ్రీవారి లడ్డు కల్తీ అసత్య ప్రచారంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్
తిరుమల తిరుపతి శ్రీ వారి లడ్డు కల్తీ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంపై తక్షణమే...
By Rajini Kumari 2026-02-27 10:25:50 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com