ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్

0
82

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్

కర్నూలులో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడి

రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కర్నూల్‌లో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.

 

కర్నూల్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని, మొత్తం 1,460 ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఓర్వకల్లుకు ఎన్నడూ లేనంతగా పరిశ్రమలు వస్తున్నాయని, రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామని వెల్లడించారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అమలైతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి అభివృద్ధి సాధిస్తుందని మంత్రి భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారతావజ్ టీం #శివనాగేంద్ర...
By SivaNagendra Annapareddy 2025-12-26 04:56:23 0 591
Andhra Pradesh
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం పల్లె కృష్ణ CTIU తాడేపల్లి మండలం కన్వీనర్
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం.    పల్లె కృష్ణ, సిఐటియు తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-20 13:49:07 0 200
Meghalaya
Global Military Drills in Umroi
The maiden edition of the multinational joint military exercise, PRAGATI 2026, has entered an...
By Dunna Jessicaruth 2026-05-25 06:47:10 0 66
Andhra Pradesh
కర్నూలు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ::
కర్నూలు:  కర్నూలులో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు...
By Hari Krishna 2025-12-24 14:56:03 0 719
Telangana
అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల
గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-03-16 10:09:22 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com