ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!

0
82

 

 

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!

13-06-2026 Sat 15:37

Andhra

Minister Nara Lokesh releases IIIT admission results check details here

ఆర్జీయూకేటీ ఆరేళ్ల బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలు విడుదల

2026–27 విద్యా సంవత్సరానికి 4,040 మంది విద్యార్థుల ఎంపిక

ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే

గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్

ఎంపికైన విద్యార్థులు rgukt.in వెబ్‌సైట్ నుంచి లేఖలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం.

 

ఈ ఏడాది మొత్తం 44,104 దరఖాస్తులు రాగా, వారిలో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈ ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఆర్జీయూకేటీ లక్ష్యం మరోసారి నెరవేరిందని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

 

ఎంపికైన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు తమ ఎంపిక పత్రాలను (Selection Letters) అధికారిక వెబ్‌సైట్ rgukt.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే, సహాయం కోసం 9552300009 అనే వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్‌ను సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh Advances Agriculture and Rural Development
Chhattisgarh continues to strengthen its agriculture and rural development sector through...
By Fathima Safa 2026-07-03 15:10:26 0 83
Andhra Pradesh
కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం   మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి,...
By Rajini Kumari 2026-05-07 08:22:59 0 126
Andhra Pradesh
రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన
 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ...
By Gadiyapudi Narendra 2026-03-05 05:54:40 0 279
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ఈ నెల 27వ తేదీ...
By Chennaiah Kati 2026-06-25 13:10:54 0 58
Jharkhand
Jharkhand Boosts Employment and Startup Growth in 2026
Jharkhand has continued to strengthen employment generation and entrepreneurship initiatives...
By Fathima Safa 2026-07-01 09:51:12 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com