మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ

0
218

మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ

ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ ద్వారా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వైసీపీ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ మెడికల్ కళాశాలలను తాము ఏర్పాటు చేశామని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల జోక్యం ఉండకూడదని, అలా జరిగితే పేదలకు వైద్య విద్యా అవకాశాలు దూరమవుతాయని ఆ పార్టీ వాదిస్తోంది. అప్పటి ప్రభుత్వం ఈ కళాశాలల నిర్వహణకు బడ్జెట్ భారం లేకుండా చూసుకునేలా విధానాలు రూపొందించిందని, కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్‌కు కేటాయించి ఆ ఆదాయాన్ని ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించేలా మార్గదర్శకాలు తయారు చేసిందని కోర్టుకు పిల్ లో వివరించింది.పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ఈ కళాశాలలను నడిపిస్తే వైద్య విద్య మాత్రమే కాకుండా, సామాన్యులకు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండవని, అవి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ తన పిల్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆర్థిక భారం ఎక్కువగా ఉందన్నది వాస్తవం కాదని, ఇందుకు సంబంధించి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కోటి సంతకాలు సేకరించామని కూడా కోర్టుకు తెలిపింది.టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్‌లను వైసీపీ చేర్చింది.

 

#Narendra

Search
Categories
Read More
Puducherry
Puducherry Declares Muharram Holiday and Work Swap
he Government of Puducherry has officially announced a public holiday on June 26, 2026, in...
By Lokeshwari Panthadi 2026-06-29 04:43:23 0 66
Andhra Pradesh
లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్...
By Chennaiah Kati 2026-07-17 07:16:14 0 45
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:32:29 0 2K
Andhra Pradesh
నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం...
By Rajini Kumari 2026-03-03 11:56:36 0 179
Telangana
వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో విదేశీ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసారు
మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో సమావేశమై...
By Avunoori Mahesh 2026-04-15 11:02:33 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com