వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు.

0
72

 

 

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

11-06-2026 Thu 

Andhra

Vizag Steel Plant accident Jagan key comments on victim compensation

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలన్న జగన్

విశాఖ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్ జగన్

చట్టపరమైన చెల్లింపులను ప్రభుత్వ సాయంగా చూపడాన్ని తప్పుబట్టిన జగన్

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం

వీఎస్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు చట్టబద్ధమైన పరిహారంతో పాటు అదనంగా కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నిన్న పరామర్శించిన అనంతరం, జగన్ వారి కుటుంబ సభ్యులు మరియు కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. గత జూన్ 8న స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1)లో ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ పేలిన దుర్ఘటనలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

 

ఈ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే పరిహారాన్ని ప్రకటించారు. అయితే, బీమా, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), గ్రాట్యుటీ వంటి చట్టబద్ధంగా రావాల్సిన చెల్లింపులను (సుమారు రూ. 1.45 కోట్లు) ప్రభుత్వ సాయంగా చూపడాన్ని జగన్ తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనను జగన్ గుర్తుచేశారు. ఆ సమయంలో తమ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించిందని ఆయన పేర్కొన్నారు. వీఎస్పీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ పరిహార హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.        

Search
Categories
Read More
Telangana
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
By Ponnala Srinivasrao 2026-03-01 06:29:46 0 631
Andhra Pradesh
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
By Pagadala Venkateswar 2026-01-31 10:39:59 0 388
Telangana
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
By Pinnehasan Odela 2026-04-08 13:32:29 0 176
Telangana
ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:21:30 0 182
Tamilnadu
Tamil Nadu Advances Biotechnology and Life Sciences Research
Tamil Nadu continues to strengthen its position as one of India's leading biotechnology and life...
By Fathima Safa 2026-06-29 09:59:48 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com