తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం

0
137

తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణం పెరుగుతూ.. కూరగాయలు, ఉద్యాన పంటల సాగు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయం పెంపు, సహజ వనరుల సంరక్షణ, భవిష్యత్‌ ఆహార భద్రత కోసం రాష్ట్రంలో పంటల మార్పిడికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. వాతావరణ జోన్ల ఆధారంగా పంటల ప్రణాళికను రూపొందించాలని.. పంటల మార్పిడి లక్ష్యాలను నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సంవత్సరాల వారీగా, గ్రామాల వారీగా నిర్ణయించాలని కమిషన్‌ సూచించింది. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ సమస్య ప్రధానంగా ఉందని పేర్కొంది. కేరళ తరహాలో రాష్ట్రంలో కూరగాయల క్లస్టర్‌ను, నాసిక్‌లోని సహ్యద్రి ఫార్మ్స్‌ తరహాలో ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్రంలో పంటల మార్పిడి అంశంపై రైతు కమిషన్‌ రూపొందించిన నివేదికను మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది. మొత్తం 40 పేజీల నివేదికలో ఉద్యాన, సాంప్రదాయ, ఇతర ముఖ్య పంటల వివరాలను, ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనం వివరాలను, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను వివరంగా పేర్కొంది. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) నిర్ణయించాలని.. ఇందుకోసం రైతులు సభ్యులుగా ఉండే ప్రత్యేక ధరల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరింది. రాష్ట్రంలో మార్కెట్లను సందర్శించినప్పుడు దళారీ వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉన్నట్టుగా గుర్తించామని, దాన్ని నియంత్రించాలని సూచించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.
    పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు 13-06-2026 Sat...
By Pagadala Venkateswar 2026-06-13 11:31:33 0 70
Andhra Pradesh
పెద్దమండ్యం: గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, 16వ శతాబ్దపు శిలాశాసనం లభ్యం.
అనమయ్య జిల్లా, తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం గ్రామం పేరు వెనుక గొప్ప చరిత్ర దాగి ఉంది....
By Pagadala Venkateswar 2026-06-03 11:12:45 0 65
Business & Finance
Kerala Tourism Sees Strong Monsoon Bookings
Kerala's tourism industry is witnessing strong monsoon bookings as domestic travelers...
By Navya Sree 2026-07-06 07:31:32 0 89
Andhra Pradesh
Tirumala Festival: తిరుమలలో వేటగాడిగా మారిన శ్రీనివాసుడు! పార్వేట మండపంలో అట్టహాసంగా పార్వేటి ఉత్సవం..
తిరుమల గిరిపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి చెంత సంక్రాంతి సంబరాలు...
By Pagadala Venkateswar 2026-01-17 06:18:11 0 321
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డోన్ ఎంఎల్ఎ!!
కర్నూలు : డోన్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న...
By Hari Krishna 2025-12-25 08:05:02 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com